Karnataka honeytrap scandal: కర్ణాటక హనీట్రా్పపై సుప్రీంలో పిల్
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:28 AM
కర్ణాటకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, కేంద్ర నాయకులపై జరిగిన హనీట్రాప్ కేసుపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీజేఐ ధర్మాసనం త్వరలో విచారణ చేపడతామని తెలిపింది.

బెంగళూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఇద్దరు మంత్రులు సహా వివిధ పార్టీలకు చెందిన 48 మంది ఎమ్మెల్యేలతో పాటు న్యాయమూర్తులు, కేంద్ర నాయకులపై హనీట్రాప్ జరిగిందంటున్న అంశంపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జార్ఖండ్లోని ధన్బాద్ నివాసి వినయ్కుమార్ దీన్ని దాఖలు చేశారు. తనపై హనీట్రాప్ జరిగిందని కర్ణాటక మంత్రి రాజణ్ణ శాసనసభలో స్వయంగా ప్రస్తావించడం, మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకించారు. దీనిని అత్యవసరమైనదిగా భావించి, విచారణ జరపాలని కోరారు. స్పందించిన సీజేఐ జస్టిస్ ఖన్నా ధర్మాసనం ఒకట్రెండు రోజుల్లోనే విచారణ చేపడతామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News