Tirumala : శ్రీవారిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా..
ABN, Publish Date - Mar 19 , 2025 | 02:21 PM
Miss Universe At Tirumala : విశ్వసుందరి విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ఇవాళ తిరుమలను సందర్శించారు. సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫోటోలు మీకోసం..

2024 మిస్ యూనివర్స్ టైటిల్ విజేత డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం తిరుమలకు విచ్చేశారు.

శ్రీ వారి దర్శనం కోసం తిరుమల విచ్చేసిన విశ్వ సుందరి విక్టోరియా క్జార్ థెయిల్విగ్ను కార్యనిర్వాహణాధికారి భాస్కర్ రావు సాదరంగా ఆహ్వానించారు.

వెంకటేశ్వరుని దర్శనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి అనంతరం మిస్ యూనివర్స్ విక్టోరియాకు శ్రీవారి ఫొటో, ప్రసాదం అందించారు.

దర్శనానంతరం మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ఆలయ విశిష్టత, సంప్రదాయాలు మొదలైన వివరాల గురించి పూజారులు, తితిదే పాలనాధికారులను అడిగి తెలుసుకున్నారు.

కలియుగ దైవం తిరుమల గోవిందుని దర్శనం తనకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిందని దర్శనానంతరం ఈ విశ్వ సుందరి వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతి పట్ల ఆసక్తి, నమ్మకంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
Updated at - Mar 19 , 2025 | 02:58 PM