సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం

ABN, Publish Date - Mar 20 , 2025 | 09:25 PM

సంగారెడ్డి జిల్లాలోని ఈశ్వరపురంలో దుర్గ భవాని మాత మహా క్షేత్రంలో గురువారం నాడు లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 1/6

సంగారెడ్డి జిల్లాలోని ఈశ్వరపురంలో గురువారం నాడు లక్ష దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. దుర్గ భవాని మాత ఆలయాన్ని సుందరంగా దీపాలంకరణ చేశారు.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 2/6

ఆలయం వద్ద దీపాలు వెలిగించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు భారీగా తరలి వచ్చి దీపాలు వెలిగించారు.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 3/6

కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. పట్టణంలో నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా మహిళామణులు కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 4/6

పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. మహిళలు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 5/6

ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం తరలిరావడంతో క్షేత్ర వీధులు భక్తుల రద్ధీతో దర్శనమిచ్చాయి.

సంగారెడ్డిలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం 6/6

అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణ చేశారు. ఇందులో భాగంగా వివిధ ఆకృతుల్లో రూపొందించిన దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు.

Updated at - Mar 20 , 2025 | 09:30 PM