Telangana SSC Exams: పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - Mar 20 , 2025 | 10:19 PM
తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవి దృష్ట్యా తాగునీటి సౌకర్యం, ప్రతి రూములో ఫ్యాన్లు, తగిన ఫర్నిచర్, లైట్లు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు.

తెలంగాణలో రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి పాఠశాలలో పదోతరగతి పరీక్ష ఏర్పాట్లను గురువారం నాడు రంగారెడ్డి డీఈఓ సుశీంద్రరావు పరిశీలించారు.

పదోతరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

రేపటి (శుక్రవారం) నుంచి జరిగే పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వేసవి దృష్ట్యా తాగునీటి సౌకర్యం, ప్రతి రూములో ఫ్యాన్లు, తగిన ఫర్నిచర్, లైట్లు ఏర్పాట్లు చేయాలని కోరారు.

అధికారులకు సూచనలు ఇస్తున్న రంగారెడ్డి డీఈఓ సుశీంద్ర రావు

పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని అధికారులు అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు.

ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పారు. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Updated at - Mar 20 , 2025 | 10:35 PM