ICC : ఐసీసీ జట్టులో త్రిష, కమలిని
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:24 AM
మహిళల అండర్-19 టీ20 వరల్డ్క్పలో విశేషంగా రాణించిన ప్లేయర్లతో కలిపి ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏకంగా నలుగురికి చోటు దక్కడం విశేషం. ప్లేయర్

దుబాయ్: మహిళల అండర్-19 టీ20 వరల్డ్క్పలో విశేషంగా రాణించిన ప్లేయర్లతో కలిపి ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏకంగా నలుగురికి చోటు దక్కడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన జి.త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఈ ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కైలా రెనెకెను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇక నిక్కీ ప్రసాద్ కెప్టెన్సీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్కు చేరి, రెండోసారి చాంపియన్ అయిన విషయం తెలిసిందే.