Khelo India : ఖేలో ఇండియా గేమ్స్లో నయనకు స్వర్ణం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:18 AM
ఖేలో ఇండియా శీతాకాల క్రీడల్లో హైదరాబాద్ స్కేటర్ తాళ్ళూరి నయన శ్రీ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా శీతాకాల క్రీడల్లో హైదరాబాద్ స్కేటర్ తాళ్ళూరి నయన శ్రీ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం లద్దాఖ్లో జరిగిన ఈ పోటీల్లో 15 ఏళ్ల నయన స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్ల విభాగంలో 1 నిమిషం 1.35 సెకన్లలో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలించింది.