ఆ నిబంధన మార్చం: బీసీసీఐ
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:57 AM
బీసీసీఐ ఇటీవల కొత్తగా అమలుల్లోకి తెచ్చిన ‘క్రికెటర్లతో కుటుంబ సభ్యులు’ నిబంధన విషయంలో పునరాలోచన చేస్తున్నదంటూ...

న్యూఢిల్లీ: బీసీసీఐ ఇటీవల కొత్తగా అమలుల్లోకి తెచ్చిన ‘క్రికెటర్లతో కుటుంబ సభ్యులు’ నిబంధన విషయంలో పునరాలోచన చేస్తున్నదంటూ వస్తున్న వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించాడు. ఈ ఆంక్షలపై విరాట్ కోహ్లీ విమర్శలు చేయడంతో..నిబంధనలను బీసీసీఐ సడలించనున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనిపై సైకియా స్పందిస్తూ ‘కొత్త నిబంధన అమలులో ఉంటుంది. అది దేశానికి, బీసీసీఐకి ఎంతో ముఖ్యమైనది’ అని స్పష్టంజేశాడు.