Hyderabad: గ్రేటర్లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:46 AM
గ్రేటర్లో రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 32 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్రత పెరిగినా, రాత్రుళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో 8-13 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరిగింది.

- పటాన్చెరులో 8.6 డిగ్రీలు
- రాజేంద్రనగర్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్లో రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 32 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్రత పెరిగినా, రాత్రుళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో 8-13 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. మంగళవారం పటాన్చెరు(Patancheru)లో అత్యల్పంగా 8.6డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్(Rajendranagar)లో 10, దుండిగల్లో 13.8, బేగంపేట ప్రాంతాల్లో 13.8, హయత్నగర్లో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలితీవ్రత అధికంగా ఉంది. తెల్లవారు జామున ప్రధాన రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మకానికి అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలు
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News