ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:04 PM
తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగబోయే సార్వత్రిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బుధవారం కలెక్టర్ తన ఛాంబర్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేశామని, ఎస్ఎస్సీకి సంబంధించి మూడు సెంటర్లలో 600 మంది విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ అయిదు సెంటర్లలో 990 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతు న్నారన్నారు. ఆయా పరీక్షల పూర్తి ఏర్పాట్లను డీఈవో పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. అధికారులందరు పరీక్షలను సమర్థవంతంగా ని ర్వహించాలని సూచించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ పరీక్ష సెంటర్ల దగ్గర పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లా విద్యాధికారి, టాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీఎం హెచ్వో డా.సౌభాగ్యలక్ష్మి, డీఐఈవో సుదర్శన్రావు, పోస్టాఫీస్ సూపరింటెండెంట్, డీపీవో కృష్ణయ్య పాల్గొన్నారు.