పది పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:35 PM
జిల్లా లో శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎస్పీ శ్రీనివాసరావు జిల్లాకేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీ లించారు.

గద్వాల క్రైం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): జిల్లా లో శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎస్పీ శ్రీనివాసరావు జిల్లాకేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీ లించారు. అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సమస్య లేకుం డా చూడాలని చెప్పారు. పరీక్షా సమయంలో విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగులయ్య, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఉన్నారు.