సామరస్యమే పండుగల సూత్రం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:54 PM
సామరస్యమే అన్ని మతాల సూత్రమని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వారు మాట్లాడారు.

ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
ఉత్సాహంగా ఇఫ్తార్ విందు
భువనగిరిటౌన్, యాదగిరిగుట్ట రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సామరస్యమే అన్ని మతాల సూత్రమని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వారు మాట్లాడారు. రంజాన్ను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేజ్చిస్తీ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుట్ట మసీద్లో నిర్వహించిన ఇప్తార్ విందులో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.
అల్విదా ఆఖరీ జుమ్మా
రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరిచుకొని భువనగిరిలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు అధిక సంఖ్యలో మసీదుల్లో సామూహిక నమాజ్ చేశారు. దీంతో అన్ని మసీదులు కిక్కిరిశాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం బోర్డు పిలుపు మేరకు ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు.