Weather: రేపటి నుంచి ఎండల తీవ్రత
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:09 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 40-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.