వామ్మో.. చిరుత పులులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 04:38 PM
Leopard: పులివెందులలో చిరుత పులులు హల్చల్ చేస్తున్నాయి. బైక్పై వెళ్తున్న వ్యక్తిని పులి వెంబడించడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కడప, ఫిబ్రవరి 10: జిల్లాలోని పులివెందుల (Pulivendula) ప్రాంతంలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతున్నాయి. లింగాలమండలం రామాపురం వద్ద చిరుతపులి సంచరించింది. బైక్పై వెళ్తున్న జితేంద్ర అనే వ్యక్తిని చిరుత పులి వెంబడించింది. పులి నుంచి తప్పించుకున్న బాధితుడు భయంతో పులివెందులకు చేరుకుని అటవీశాఖ అధికారులుకు సమాచారం అందజేశాడు. గత పదిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో మగ చిరుత పులి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆడ చిరుతపులి, పిల్లలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పులివెందుల నియోజికవర్గంలోని మూడు మండలాల్లో చిరుత పులి తిరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు. కామసముద్రం, రామాపురం, నలుపురెడ్డిపల్లె, కొత్తపల్లె, పరి సరప్రాంతాలలో చిరుత తిరుగుతున్నట్టు సమాచారం ఉంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రల జాడల కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు
అదొక్కటి గుర్తుపెట్టుకోండి.. స్టూడెంట్స్కు మోడీ సజెషన్
Read Latest AP News And Telugu News
Updated at - Feb 10 , 2025 | 04:38 PM