Nara Lokesh: లోకేష్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:54 PM
టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి చేస్తే మీరు మెచ్చకుంటారు.. అదే తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు’’.. అని అన్నారు.

టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి చేస్తే మీరు మెచ్చకుంటారు.. అదే తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు’’.. అని అన్నారు. ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు అనేది అసాధారణమైన రికార్డ్ అని, అలాంటి రికార్డును 83 రోజుల్లో టీడీపీ సాధించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ అండమాన్ నికోబార్లో కూడా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకున.. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పెంచడం జరిగిందని పేర్కొన్నారు.