Home » Crop Loan Waiver
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి?
పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్లైన్గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది.
పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.