నీ అంతు చూస్తానంటూ..వైసీపీ నేత దురుసు ప్రవర్తన

ABN , First Publish Date - 2022-10-31T18:42:53+05:30 IST

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. నీ అంతు చూస్తానంటూ..ఏసీపీ వెంకటరత్నాన్ని వైసీపీ నేత గౌసాని బెదిరించినట్లు ఆరోపణలు వస్తోన్నాయి.

నీ అంతు చూస్తానంటూ..వైసీపీ నేత దురుసు ప్రవర్తన

విజయవాడ: కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. నీ అంతు చూస్తానంటూ..ఏసీపీ వెంకటరత్నాన్ని వైసీపీ నేత గౌసాని బెదిరించినట్లు ఆరోపణలు వస్తోన్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఏసీపీని గౌసాని బెదిరించినట్లు తెలుస్తోంది. ఏసీపీకి వేలు చూపిస్తూ వైసీపీ నేత గౌసాని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇదిలా వుండగా గన్నవరం ఎయిర్‌పోర్టులో షార్జా విమాన ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు బాలశారి, కేశినేని నాని హాజరయ్యారు. అనుమతి లేదంటూ వైసీపీ నేత గౌసానిని పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ వైసీపీ నేత గౌసాని దుర్భాషలాడినట్లు తెలిసింది. ఏసీపీపై దాడి చేసేందుకు కూడా యత్నించినట్లు సమాచారం ఈ ఘటనను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఎంపీ బాలశౌరి దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2022-10-31T18:42:56+05:30 IST