Tammineni Seetaram: చంద్రబాబు ఫ్రస్టేషన్ పెరిగిపోయి మాట్లాడుతున్నారు

ABN , First Publish Date - 2022-11-19T17:27:02+05:30 IST

Vizag: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandra Babu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు రోజురోజుకి ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని, అందుకు కర్నూలు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు.

Tammineni Seetaram: చంద్రబాబు ఫ్రస్టేషన్ పెరిగిపోయి మాట్లాడుతున్నారు

Vizag: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandra Babu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు రోజురోజుకి ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని, అందుకు కర్నూలు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. పాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ (CM Jagan) పూర్తి స్పష్టతతో ఉన్నారని, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రామారావు గుర్తుకొచ్చే చంద్రబాబుకు ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అంపశయం మీదున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సమాధి చేస్తారని, రానున్న రోజుల్లో చంద్రబాబుకు మహిళల నుంచి ప్రతిఘటన తప్పదని తమ్మినేని జోస్యం చెప్పారు.

Updated Date - 2022-11-19T17:27:59+05:30 IST