Anand Babu: పెత్తనమంతా జగన్ వర్గందే
ABN , First Publish Date - 2022-12-01T16:31:17+05:30 IST
రాష్ట్రంలో పదవులన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గంతో నిండిపోయాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు (TDP senior leader Nakka Anand Babu) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 800 మందిని వివిధ

అమరావతి: రాష్ట్రంలో పదవులన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గంతో నిండిపోయాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు (TDP senior leader Nakka Anand Babu) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 800 మందిని వివిధ పదవుల్లో జగన్ వర్గీయులనే నియమించారని విమర్శించారు. డీఎస్పీ(DSP) పోస్టింగ్ల్లో కూడా 40 శాతం మందిని తన వర్గం వారిని నియమించారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి(Cm jagan), సీఎస్, డీజీపీ, సలహాదారు అంతా ఒకే జిల్లా ఒకే వర్గం వారేనని దుయ్యబట్టారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్గా సీనియర్ అయిన బాలు నాయక్ని పక్కనపెట్టి ఆయన కన్నా జూనియర్ అయిన తన వర్గానికి చెందిన సుబ్బారెడ్డిని జగన్ నియమించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని దళితులంతా స్పందించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జగన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారినే జగన్ దగా చేస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు.