AP News: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల ఘరానా మోసం
ABN , First Publish Date - 2022-12-27T15:15:00+05:30 IST
విజయనగరం: జిల్లాలో కొందరు వాలంటీర్లు (Volunteers) ఘరానా దోపిడీ చేస్తున్నారు. వాలంటీర్ల తీరుతో కొన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.

విజయనగరం: జిల్లాలో కొందరు వాలంటీర్లు (Volunteers) ఘరానా దోపిడీకి పాల్పడ్డారు. వాలంటీర్ల తీరుతో కొన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. చీటీల పేరుతో డబ్బులు వసూళ్లు చేసిన ముఠా (Gang) పరారైంది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. విజయనగరాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్రలోని ఘరానా మోసం జరిగింది. కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పారిపోయారు. దీనంతటికి ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థే కారణమని బాధితులు చెబుతున్నారు. ‘ఏఆర్ బెనిఫిట్ ఫుడ్ సంక్రాంతి కానుక’ పేరుతో సుమారు 25 వేల మంది దగ్గర వాలంటీర్లు భారీగా డబ్బులు వసూలు చేశారు

. మోసపోయిన బాధితులు గుర్ల, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కాగా కీలక వాలంటీర్ పతివాడ శ్రీలేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పథకం కీలక సూత్రధారి మజ్జి అప్పలరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.