Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2023-09-18T10:44:28+05:30 IST

కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

చిత్తూరు: కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రేపటి (మంగళవారం) నుంచి మొదలుకానున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra reddy) స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు దర్శనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులను బయటే క్యూలైన్‌లలో నిలిపివేయడంతో లోపల క్యూలైన్‌లన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దర్శనం నిలిపేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా ఆలయ అధికారులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి వెంట వచ్చిన పోలీసులు, జిల్లా అధికారులను కూడా సిబ్బంది తోసిపడేశారు.

Updated Date - 2023-09-18T10:44:28+05:30 IST