Annamayya district: మంచంపై నుంచే పరీక్షకు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:06 AM
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి మంచంపై ఉండే పదోతరగతి పరీక్ష రాశాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ ఆకులవారిపల్లెకు చెందిన లహిత్కుమార్రెడ్డి పదోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు మదనపల్లెకు తరలించి చికిత్స చేయించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి మంచంపై ఉండే పదోతరగతి పరీక్ష రాశాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ ఆకులవారిపల్లెకు చెందిన లహిత్కుమార్రెడ్డి పదోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు మదనపల్లెకు తరలించి చికిత్స చేయించారు. మంగళవారం ప్రారంభమైన తెలుగు పరీక్షకు విద్యార్థి హాజరు కావలసి ఉంది. నడవలేని, కూర్చోలేని పరిస్థితిలో ఉన్న అతనిని కుటుంబీకులు కారులో పరీక్షా కేంద్రమైన ఏపీ మోడల్ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడే హాస్టల్లోని ఓ మంచం మీద పడుకోబెట్టి నలుగురు మోసుకుంటూ లోనికి తెచ్చారు. ఓ సహాయకుడిని ఏర్పాటు చేసి లహిత్కుమార్రెడ్డి పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించారు. దీంతో ఆ విద్యార్థి మొదటి పరీక్ష పూర్తి చేశాడు.
- బి.కొత్తకోట, ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్