Share News

Cyclone Micahung: తీవ్ర తుఫానుగా ‘మిచాంగ్’.. ప్రజలకు హెచ్చరిక

ABN , First Publish Date - 2023-12-04T14:55:48+05:30 IST

Andhrapradesh: మిచాంగ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. తీవ్ర తుఫాను రేపు (మంగళవారం) నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

Cyclone Micahung: తీవ్ర తుఫానుగా ‘మిచాంగ్’.. ప్రజలకు హెచ్చరిక

విశాఖపట్నం: ‘’మిచాంగ్’’ (Cyclone Michaung)తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. తీవ్ర తుఫాను రేపు (మంగళవారం) నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. పాండిచ్చేరికి ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 320 కి.మీ దూరంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదన్నారు. తుఫాను ప్రభావంతో చెన్నై ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డైరెక్టర్ సునంద వెల్లడించారు.

Updated Date - 2023-12-04T14:55:51+05:30 IST