మదనపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయండి
ABN , First Publish Date - 2023-06-16T23:34:57+05:30 IST
మదనపల్లె నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ జెండా ఎగురవేసేలా కష్టపడాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు.

నాయకులకు దిశా నిర్ధేశం చేసిన చంద్రబాబు
మదనపల్లె టౌన, జూన 16: మదనపల్లె నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ జెండా ఎగురవేసేలా కష్టపడాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. శుక్రవా రం చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో రో జు పర్యటనలో ఉన్న చంద్రబాబును మదన పల్లె టీడీపీ నాయకులు కలసి శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన బాదుడే బాదుడు ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాల గురించి వివ రించారు. పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ, ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, రైతు, బీసీ విభాగం రాష్ట్ర నాయకులు బాలుస్వామి, గుత్తికొండ త్యాగరాజు, విజయమ్మ పాల్గొన్నారు.