వైవీబీకి పరామర్శ
ABN , First Publish Date - 2023-06-09T01:13:00+05:30 IST
గుండెపోటుతో విజయవాడ రమేశ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ను పలువురు టీడీపీ నాయకులు గురువారం పరామర్శించారు

ఉయ్యూరు, జూన్ 8 : గుండెపోటుతో విజయవాడ రమేశ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ను పలువురు టీడీపీ నాయకులు గురువారం పరామర్శించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, శ్రీరాం తాతయ్య, బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, జంపాన వీరశ్రీనివాస్, అనుమోలు ప్రభాకర్, వెలగపూడి శంకరబాబు, పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి తదితరులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.