Share News

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న పవన్ కల్యాణ్.. కార్యకర్తల ఫ్యామిలీకి రూ.55 లక్షల సాయం

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:58 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పలు ప్రమాదాల్లో మృత్యువాత చెందిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ రూ.55 లక్షల ఆర్థిక సాయం అందించారు.

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న పవన్ కల్యాణ్.. కార్యకర్తల ఫ్యామిలీకి రూ.55 లక్షల సాయం

సహాయ కార్యక్రమాల్లో ముందుండే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని చేశారు. కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను పవన్ అందజేశారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


ఇప్పటికే ఏపీలో పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న 73 మంది రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.

Updated Date - Dec 30 , 2023 | 05:11 PM