AP News: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి

ABN , First Publish Date - 2023-07-15T10:20:47+05:30 IST

అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు.

AP News: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి

పశ్చిమగోదావరి: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా తూనుగుంట్ల రఘునాధం అనే యాత్రికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కాట్రాలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రఘునాధం ఈరోజు (శనివారం) ఉదయం మృతి చెందాడు. రఘునాధం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు సహకరించాలని అధికారులను కుటుంబసభ్యులను కోరుతున్నారు. రఘునాధం తాడేపల్లిగూడెం నుంచి ఈనెల 4వ తేదీన 10 మంది బృందంతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. జమ్మూ ఆసుపత్రిలో రఘునాథం భౌతికకాయం వద్ద ఉన్న మణికంఠ అనే యువకుడు ఉన్నాడు. ఏదైనా సమాచారం కోసం యువకుడి నెంబర్‌కు 9541735272 కాల్ చేయాల్సిందిగా అధికారులు తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-15T10:20:47+05:30 IST