Chennai - Tirupati Trains: రేపటి నుంచి చెన్నై - తిరుపతి రైళ్ల సేవల్లో మార్పు

ABN , First Publish Date - 2023-08-30T10:02:19+05:30 IST

చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 31వ తేది నుంచి సెప్టెంబరు 2వ తేది వరకు రేణిగుంట(Renigunta)

Chennai - Tirupati Trains: రేపటి నుంచి చెన్నై - తిరుపతి రైళ్ల సేవల్లో మార్పు

పెరంబూర్‌(చెన్నై): చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 31వ తేది నుంచి సెప్టెంబరు 2వ తేది వరకు రేణిగుంట(Renigunta) వరకు మాత్రమే వెళ్లనున్నాయి. చెన్నై సెంట్రల్‌(Chennai Central) నుంచి ఉదయం 6.25 గంటలకు తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.16057) రేణిగుంట వరకు మాత్రమే వెళ్తుంది. మరోమార్గంలో ఈ రైలు (16054) తిరుపతికి బదులుగా ఉదయం 10.10 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరుతుంది.

విల్లుపురం - తిరుపతి రైలు... : విల్లుపురం నుంచి ఉదయం 5.30 గంటలకు తిరుపతికి బయల్దేరే (నెం.16854) రైలు కాట్పాడి వరకు మాత్రమే వెళ్తుంది. మరోమార్గంలో ఈ రైలు (నెం.16853) మధ్యాహ్నం 1.30 గంటలకు కాట్పాడి నుంచి విల్లుపురం బయల్దేరుతుంది.

చెన్నై - బిట్రగుంట రైళ్ల రద్దు...

బిట్రగుంట నుంచి తెల్లవారుజామున 4.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయల్దేరే (నెం.17237) రైలు, మరోమార్గంలో చెన్నై సెంట్రల్‌ నుంచి సాయం త్రం 4.30 గంటలకు బయల్దేరే (నెం.17238) బిట్రగుంట బయల్దేరే రైలు సెప్టెంబరు 1వ తేది వరకు పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-30T10:02:21+05:30 IST