Share News

Ayodhya: అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. ర్యాలీ నిర్వహించిన ప్రవాసులు

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:56 AM

అయోధ్య(Ayodya Ram Mandir) రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు.

Ayodhya: అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. ర్యాలీ నిర్వహించిన ప్రవాసులు

వాషింగ్టన్: అయోధ్య(Ayodya Ram Mandir) రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగాయి. వీరంతా ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ కు సమీపంలో ఉన్న అయోధ్య వేలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో సమావేశమయ్యారు.

వారు మాట్లాడుతూ.. "హిందువుల 500 సంవత్సరాల పోరాటం తరువాత రామమందిర నిర్మాణం జరుగుతోంది. జనవరి 20న వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తాం. అమెరికాలో జన్మించిన పిల్లలకు అర్థమయ్యేటట్లు 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవితవిశేషాలను ప్రదర్శిస్తాం" అని అమెరికా చాప్టర్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:26 AM