Vijayashanti: వాస్తవానికి పాలకులు ఎన్నడూ అతీతులు కారు

ABN , First Publish Date - 2023-05-08T14:11:13+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రపై ఆ పార్టీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Vijayashanti: వాస్తవానికి పాలకులు ఎన్నడూ అతీతులు కారు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రపై ఆ పార్టీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గతంలోని తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎక్కడుందని కొందరు అంటున్నారని.. ఆ ఉద్యమంలో ముందుండి పోట్లాడిన తమ లాంటి మావంటి ఉద్యమకారులం ఈరోజు బీజేపీ వైపు ఉన్నామన్నారు. అలా ఉన్నామంటే భవిష్యత్ తెలంగాణ బాగు కోసం అన్న నమ్మకంతో మాత్రమే అని తెలిపారు. తెలంగాణ కోసం జీవితం అంతా పోరాటంతో గడిపిన తమకు, ఉద్యమకారులకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకన్నా ఊపిరి ఉన్నంతవరకూ ఎప్పటికీ వేరే ప్రాతిపదికత ఉండదని స్పష్టం చేశారు. జన జీవితంలో ప్రజా ఉద్వేగాలు ఎప్పటికీ జీవన సూత్రాలే అని అన్నారు. కాలం ఎప్పటి నుంచో చెబుతున్నా వాస్తవానికి పాలకులు ఎన్నడూ అతీతులు కారని విజయశాంతి పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-08T14:11:13+05:30 IST