Share News

Chevella: కాళేశ్వరంపై విచారించి కేసీఆర్‌ను జైలుకు పంపుతాం: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2023-11-19T19:18:31+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) మొత్తం అవినీతిమయంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్ అవినీతి కక్కిస్తామని పేర్కొన్నారు.

Chevella: కాళేశ్వరంపై విచారించి కేసీఆర్‌ను జైలుకు పంపుతాం: జేపీ నడ్డా

చేవెళ్ల: కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) మొత్తం అవినీతిమయంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్ అవినీతి కక్కిస్తామని పేర్కొన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ(BJP) బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను రూపుమాపుతామని అన్నారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయాలపై పోరాడుతున్న పార్టీ బీజేపీనేని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేసి కేసీఆర్ ను జైలుకు పంపుతామన్నారు. ఎన్నో ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-11-19T19:18:33+05:30 IST