Kasani Gnaneshwar: తెలంగాణలో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు: కాసాని

ABN , First Publish Date - 2023-05-08T15:26:29+05:30 IST

తెలంగాణలో మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) పెనుమార్పులు తెచ్చారని, ఎన్టీఆర్ హాయాంలోనే పేదలకు ఆహార భద్రత లభించిందని టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు...

Kasani Gnaneshwar: తెలంగాణలో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు: కాసాని

హైదరాబాద్: తెలంగాణలో మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) పెనుమార్పులు తెచ్చారని, ఎన్టీఆర్ హాయాంలోనే పేదలకు ఆహార భద్రత లభించిందని టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మినీ మహానాడుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఎన్టీఆర్ వల్లే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ఎన్టీఆర్ తర్వాత మాజీసీఎం చంద్రబాబు (Chandrababu) టీడీపీని ముందుకు నడిపించారని కొనియాడారు. చంద్రబాబు ఐటీ అభివృద్ధి చేయటం వల్లే పేదల పిల్లలు రూ.లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలన వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని కోటీశ్వరులను చేయడమే చంద్రబాబు కల అని జ్ఞానేశ్వర్ చెప్పారు.

Updated Date - 2023-05-08T15:26:29+05:30 IST