కనుల పండువగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2023-05-18T00:18:09+05:30 IST

శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనను కనుల పండువగా నిర్వహించారు.

కనుల పండువగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
పూజల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, నాయకులు

మూడుచింతలపల్లి, మే 17: శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనను కనుల పండువగా నిర్వహించారు. శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిఽధి ఉప్పరిపల్లిలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠను వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణ మధ్య భక్తుల కోలాహలంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతి ష్ఠానంతరం పూర్ణహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. వివిధ గ్రామాల భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2023-05-18T00:18:09+05:30 IST