Telangana Elections: ఆదిలాబాద్లోని పోలింగ్ కేంద్రంలో విషాదం
ABN , First Publish Date - 2023-11-30T14:09:56+05:30 IST
Telangana Elections: జిల్లాలోని మావల మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన తోకల గంగమ్మ అనే వృద్ధురాలుకు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆదిలాబాద్: జిల్లాలోని మావల మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన తోకల గంగమ్మ అనే వృద్ధురాలుకు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గంగమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వృద్ధురాలి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి