Share News

DONATION : పాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:10 AM

కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు విరాళాలు అందించారు. మండలంలోని ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈడిగ సుధాకర్‌ ఆధ్వ ర్యంలో వారికి మంగళవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సుధాకర్‌ మాట్లాడుతూ... 1998-90 పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి రూ. 40 వేలు అంద జేసినట్లు తెలిపారు.

DONATION :  పాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం
A group of school teachers honoring donors

కళ్యాణదుర్గం (కంబదూరు), జూలై 30 : కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు విరాళాలు అందించారు. మండలంలోని ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈడిగ సుధాకర్‌ ఆధ్వ ర్యంలో వారికి మంగళవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సుధాకర్‌ మాట్లాడుతూ... 1998-90 పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి రూ. 40 వేలు అంద జేసినట్లు తెలిపారు. వారిలో గుంతకల్లు డీఆర్‌ఎం ఆఫీస్‌ సూప రింటెం డెంట్‌ గాజుల రామ్మోహన రూ. 15 వేలు, కాంట్రాక్టర్‌ మంగళకుంట నర సింహులు రూ. 10 వేలు, ఎరడికెర ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ బాల రామ్మో హన రూ. 10,116, రాళ్లపల్లి స్కూల్‌ టీచర్‌ గురుమూర్తి క్రీడా పరికరాలకు రూ. 5 వేలు, వాటర్‌ ప్యూరిఫైడ్‌ యజమాని సుధాకర్‌, ఆగస్టు 15న పిల్లల బహుమతులకు అయ్యే ఖర్చు భరిస్తానని ప్రకటించారు. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 12:10 AM