Share News

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

ABN , Publish Date - Sep 04 , 2024 | 08:08 PM

ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు.

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

అమరావతి, సెప్టెంబర్ 04: ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గృహానిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు. బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంటింటికి ఆహారం అందిస్తున్నామని వివరించారు.

Also Read: Pawan Kalyan: హైడ్రాపై కీలక వ్యాఖ్యలు.. అసహనం వ్యక్తం చేసిన పవన్


ప్రతి వార్డు సచివాలయానికి ఒక అధికారిని నియమించినట్లు తెలిపారు. 180 వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇండ్లలోకి వచ్చిన బురదను తొలిగించేందుకు 100 ఫైర్ ఇంజన్లను వినిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం బారిన పడిన వారికి మందులు సైతం సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి 4 వేల మంది సిబ్బందిని శానిటేషన్ కోసం విజయవాడకు రప్పించినట్లు చెప్పారు.

Also Read: Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన


పెద్ద ఉపద్రవం వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారికి సహకారం అందించే ప్రయత్నం తాము చేస్తుంటే.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జిడ్డు జగన్ చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. వరద ముంపు కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది


ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్బంగా రైతాంగానికి మంత్రి కె. పార్థసారథి భరోసా ఇచ్చారు. వరద నీటి ముంపు వేళ.. ప్రజలకు టీడీపీ, జనసేన శ్రేణులు చేసిన సేవలను ఈ సందర్బంగా మంత్రి కె. పార్థసారథి కొనియాడారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Also Read: Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..

Also Read: Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

Also Read: Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..

Also Read: YS Sahrmila: బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

మరిన్నీ ఆంధ్రపద్రేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తలు కోసం ..

Updated Date - Sep 04 , 2024 | 08:13 PM