Share News

TDP: టీడీపీలో చేరబోతున్నామంటూ వంశీ అనుచరుల హల్‌చల్..

ABN , Publish Date - Jul 18 , 2024 | 07:07 AM

పక్కా జిల్లా మంత్రి పేరుతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఆయనతో టచ్‌లో ఉన్నాం అంటూ తెగ హడావుడి చేస్తున్నారు.

TDP: టీడీపీలో చేరబోతున్నామంటూ వంశీ అనుచరుల హల్‌చల్..

విజయవాడ: పక్కా జిల్లా మంత్రి పేరుతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఆయనతో టచ్‌లో ఉన్నాం అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. త్వరలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరబోతున్నామని వంశీ అనుచరులు పుకార్లు సృష్టిస్తున్నారు. వంశీ అనుచరులు చేస్తున్న అసత్య ప్రచారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Pawan Kalyan: వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!


స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ సమక్షంలో సీఎం చంద్రబాబుని కలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దేవుడి పేరుతో భూ కబ్జాకు వంశీ అనుచరులు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. భూ కబ్జా కోసం రైతు బజార్లు సైతం వైసిపి కబ్జాదారులు ఖాళీ చేయించారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నాయకుల మధ్య కలతలు పెట్టేందుకు వైసీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారన్నారు. పార్టీ మారాలనుకునే వాళ్ళు ఎన్నికల ముందు ఏం చేశారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

Read more AP News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 07:07 AM