Share News

Hyderabad: చంద్రబాబు ర్యాలీలో దొంగల చేతివాటం..

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:27 PM

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మొదటిసారి నగరానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో దొంగలు చేతివాటం చూపారు. నాలుగు బంగారు గొలుసులు, మూడు సెల్‌ఫోన్‌లను చోరీ చేశారు.

Hyderabad: చంద్రబాబు ర్యాలీలో దొంగల చేతివాటం..

- నాలుగు బంగారు గొలుసులు, మూడు సెల్‌ఫోన్‌లు చోరీ

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మొదటిసారి నగరానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో దొంగలు చేతివాటం చూపారు. నాలుగు బంగారు గొలుసులు, మూడు సెల్‌ఫోన్‌లను చోరీ చేశారు. బేగంపేట నుంచి ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవన్‌ వరకు ర్యాలీ వచ్చాక సంబరాలు అంబరాన్నంటాయి. ఇదే అవకాశంగా భావించిన స్నాచర్లు తమ పని కానిచ్చారు. ఎన్‌ఏవీఎస్ రవితేజకు చెందిన 38 గ్రాముల బంగారు గొలుసు, గొరంట్ల వెంకటేష్‌, బి. శ్రీకాంత్‌లకు చెందిన 29 గ్రాముల బంగారు గొలుసులు, గాంధీ ఆచారికి చెందిన 14 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మత్తు డాక్టర్‌ ఆత్మహత్య..


అలాగే.. వెల్లంకి రమణకు చెందిన ఐ ఫోన్‌-13 మాక్స్‌ ప్రో, వెంపాటి శేలం రాజుకు చెందిన ఐ ఫోన్‌-14 మ్యాక్స్‌ప్రో, శ్రీనివాసుకు చెందిన సామ్‌సంగ్‌ ఎ-13 మొబైల్‌ ఫోన్‌లను తస్కరించారు. బాధితులు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 12:27 PM