Share News

Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:40 PM

సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు.

Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

పాకిస్థాన్, జులై 11: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక బృందాలకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని వెంటనే ఎయిరో‌పోర్ట్‌లో నిలిపివేశారు.

Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్

అనంతరం విమానం నుంచి ప్రయాణికులతోపాటు సిబ్బందిని దింపివేశారు. మరోవైపు విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు గల కారణాలను సాంకేతిక బృంద నిపుణులు అన్వేషిస్తున్నారు. ఈ రోజు ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 03:40 PM