Share News

Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:20 PM

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.

Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !
Anant Ambani-Radhika Merchant

ముంబై, జులై 08: రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల్లోని ప్రముఖలందరికి ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించింది.

అయితే అంబానీ ఇంట పెళ్లి వేడుక జరుగుతుండడంతో.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసర ప్రాంతంలోని హోటల్స్‌.. తమ రూమ్ ధరలను భారీగా పెంచేశాయి. మరోవైపు అన్ని హోటల్స్‌లోని రూములన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఈ విషయాన్ని హోటల్, ట్రావెల్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ సోమవారం స్పష్టం చేసింది.

Also Read: Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?


ముంబైలోని ప్రముఖ హోటల్స్‌ ట్రైడెంట్, ఒబెరాయి హోటల్స్‌లో రూమ్‌లు ఖాళీ అయితే లేవని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. అంతేకాదు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసర ప్రాంతాల్లోని హోటల్స్‌ రూమ్ ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.

బీకేసీలోని సోఫిటెల్ హోటల్‌లో జులై 8 నుంచి జులై 14 వరకు ధరలు ఇలా ఉన్నాయని సదరు వెబ్‌సైట్ సోదాహరణగా వివరించింది. జులై 8వ తేదీ రూమ్ ధర రూ.13 వేలు ఉంటే.. జులై 13న అదే రూమ్ ధర రూ.30,060గా ఉంది, ఇక జులై 14న రూ. 40,410 ఉందని అధికారిక ట్రావెల్స్ వెబ్‌‌సైట్ ధరలతో స్పష్టం చేసింది. జులై 10, 11 తేదీలలో ఈ హోటల్‌లో రూమ్స్ అయితే ఖాళీ లేవని పేర్కొంది. అయితే బీకేసీ సమీప ప్రాంతాలోని 5 స్టార్ హోటల్స్‌.. ది లలిత్, ఐటీసీ మరాఠా, తాజ్ శాంటాక్రాజ్, గ్రాండ్ హయత్‌లలో రూములు మాత్రం ఖాళీ ఉన్నాయని వెల్లడించింది.

Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం


Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు

ఈ నెల 5వ తేదీన ముంబైలో ప్రముఖ పాప్ స్టార్ జస్టిస్ బిబర్ సంగీత కార్యక్రమంతో న అనంత్, రాధిక మర్చంట్ వివాహ వేడుక ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. జులై 12న వీరి వివాహం జరుగనుంది. జులై 13న శుభ ఆశీర్వాద్, జులై 14న వివాహ రిసెప్షన్ కార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ వేడుకలు ముగియనున్నాయి.

మరోవైపు అంబానీ ఇంట వివాహ వేడుకలు నేపథ్యంలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నట్లు ఇప్పటికే ముంబై నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇవి జులై 12 నుంచి 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఈ మేరకు ఆ ఆదేశాలను ఎక్స్ వేదికగా ముంబై పోలీసులు పోస్ట్ చేశారు.

Read Latest News And National News

Updated Date - Jul 08 , 2024 | 05:21 PM