Share News

Jallikattu: జల్లికట్టులో అపశృతి..ఇద్దరు పోలీసులతో సహా 45 మందికి గాయాలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 05:17 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడలో తాజాగా అపశృతి చోటుచేసుకుంది. అవనియాపురం జల్లికట్టు కార్యక్రమంలో ఇద్దరు పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. మరికొంత మందిని ఆసుపత్రికి తరలించారు.

Jallikattu: జల్లికట్టులో అపశృతి..ఇద్దరు పోలీసులతో సహా 45 మందికి గాయాలు

తమిళనాడు మదురైలోని అవనియాపురం జల్లికట్టు(Jallikattu) కార్యక్రమంలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ayodhya Ram Temple: ప్రాణప్రతిష్ఠ సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..

ఇక జల్లికట్టు అనేది పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళనాడు(tamilnadu) రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకునే పురాతన క్రీడ. ఈ క్రీడలో ఒక ఎద్దును ప్రజల సమూహంలోకి విడుదల వదులుతారు. ఆ తర్వాత ఎద్దు వెనుక ఉన్న పెద్ద మూపురాన్ని పట్టుకుని దానిని ఆపడానికి అనేక మంది ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మదురైలో జల్లికట్టును సోమవారం ప్రారంభించారు. ఆ కార్యక్రమం కోసం 1,000 ఎద్దులు, 600 వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

అయితే ఈ క్రీడలో గాయపడే ప్రమాదం ఉన్నందున పాల్గొనేవారికి, ఎద్దు(bull) విషయంలో జంతు హక్కుల సంస్థలు ఈ క్రీడపై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. అయితే నిషేధానికి వ్యతిరేకంగా ప్రజల సుదీర్ఘ నిరసనల తర్వాత 2023 మేలో తమిళనాడు ప్రభుత్వం ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ 'జల్లికట్టు'ను అనుమతించే చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Updated Date - Jan 15 , 2024 | 05:17 PM