Share News

Hijacking: 15 మంది ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్న షిప్ హైజాక్

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:23 AM

15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడింది చెప్పారు.

Hijacking: 15 మంది ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్న షిప్ హైజాక్

15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్‌కు గురయ్యిందని నేవీ అధికారులు వెల్లడించారు. లైబీరియా జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్‌కు గురయ్యిందని తెలిపారు. సమాచారం అందుకున్న భారత నావికాదళం హైజాక్‌కు గురైన ఓడ 'ఎంవీ లిలా నార్ఫోక్'ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ఓడపై నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆ సిబ్బందితో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు ఓ సైనిక అధికారి చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 12:39 PM