Share News

Mohammad Yunus : రాక్షసి పీడ వదిలింది

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:08 AM

బంగ్లాదేశ్‌కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్‌ యూనుస్‌ అన్నారు.

Mohammad Yunus : రాక్షసి పీడ వదిలింది

  • హసీనాపై మహమ్మద్‌ యూనుస్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12: బంగ్లాదేశ్‌కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్‌ యూనుస్‌ అన్నారు.

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని తాను గౌరవిస్తున్నానని, వారు చెప్పినందువల్లే తాను ప్రభుత్వ తాత్కాలిక సారధిగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా తాను సారధ్యం వహిస్తున్న తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని యూనుస్‌ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారధిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ యూను్‌సకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు ఢోకా లేకుండా చూడాలని కోరారు. బంగ్లాదేశ్‌ అభివృద్ధికి భారత్‌ అన్ని రకాలుగా సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు.

Updated Date - Aug 13 , 2024 | 03:08 AM