శ్రీవారి ఆలయం వద్ద గోల్డ్ మ్యాన్ల హల్చల్..

ABN, Publish Date - Aug 23 , 2024 | 12:16 PM

తిరుపతి: శ్రావణమాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతోపాటు పెళ్లిళ్లు జరుగుతుండటంతో కొత్త జంటలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం వద్ద ఇద్దరు గోల్డ్ మ్యాన్లు హల్చల్ చేశారు. ఈరోజు శ్రావణమాసం మూడో శుక్రవారం కావడంతో పూణేకు చెందిన సన్నీ వాగచోరీ, సంజయ్ గుజర్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. మెడ నిండా బంగారు చైన్లు.. చేతి నిండా బంగారు కవచాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు వారు 20 కేజీల బంగారాన్ని ధరించారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన గోల్డ్ మ్యాన్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్‌లో ఉంది.

Updated at - Aug 23 , 2024 | 12:59 PM