Fourth Test IND Vs ENG : తడ‘బ్యాటు’
ABN , Publish Date - Feb 25 , 2024 | 05:19 AM
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత జట్టు రెండో రోజు కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి బ్యాటర్లు సత్తాచాటడంలో విఫల మయ్యారు. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/84) తన మ్యాజిక్ బంతులతో భారత టాపార్డర్తో పాటు మిడిలార్డర్ను

భారత్ మొదటి ఇన్నింగ్స్ 219/7
యశస్వీ అర్ధసెంచరీ
స్పిన్నర్ బషీర్కు నాలుగు వికెట్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353
నాలుగో టెస్టు
5 ఓ టెస్టు సిరీ్సలో 600+ పరుగులు సాధించిన ఐదో భారత బ్యాటర్గా జైస్వాల్ (618). గతంలో సర్దేశాయ్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
రాంచీ: ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత జట్టు రెండో రోజు కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి బ్యాటర్లు సత్తాచాటడంలో విఫల మయ్యారు. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/84) తన మ్యాజిక్ బంతులతో భారత టాపార్డర్తో పాటు మిడిలార్డర్ను వణికించాడు. దీంతో జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడింది. అదీగాకుండా అంపైర్కాల్స్ కారణంగా మూడుసార్లు భారత్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (117 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో 73) మాత్రం అర్ధసెంచరీతో ఫామ్ను చాటుకోగా.. గిల్ (38), క్రీజులో ఉన్న ధ్రువ్ జురెల్ (30 బ్యాటింగ్) ఫర్వా లేదనిపించారు. ఫలితంగా రెండోరోజు శనివారం ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. హార్ట్లీకి రెండు వికెట్లు దక్కాయి. ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉన్న దశలో, మూడో రోజున జురెల్, కుల్దీప్ (17 బ్యాటింగ్) ఎంతసేపు వికెట్ను కాపాడుకుంటారనేది చూడాలి. పైగా మరో మూడు ఓవర్లలో ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది. రూట్ (122 నాటౌట్) అజేయంగా నిలవగా, రాబిన్సన్ (58) అర్ధసెంచరీ సాధించాడు. ఎనిమిదో వికెట్కు ఈ జోడీ 102 పరుగుల భాగస్వామ్యం అందించింది. జడేజాకు నాలుగు, ఆకాశ్కు మూడు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.
జైస్వాల్ పోరాడినా..: భారత్ తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ ఆటే హైలైట్. మరో ఎండ్లో స్పిన్నర్ బషీర్ టపటపా వికెట్లు నేలకూలుస్తున్నా.. జైస్వాల్ మాత్రం ఆత్మవిశ్వాసంతో నిలిచాడు. మూడో ఓవర్లోనే రోహిత్ (2)ను అండర్సన్ అవుట్ చేయగా.. గిల్, యశస్వీ ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత గిల్ కాస్త జోరు పెంచి అండర్సన్ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. కానీ బషీర్ ఈ ప్రమాదకర జోడీని విడదీస్తూ గిల్ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో రెండో వికెట్కు 82 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. ఇక రజత్ పటీదార్ (17), జడేజా (12)లను బషీర్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. అంతేకాకుండా స్వల్ప వ్యవధిలోనే బషీర్ భారత్కు మరో ఝలక్ ఇచ్చాడు. సెంచరీ వైపు వెళుతున్న జైస్వాల్ను తక్కువ బౌన్స్తో వచ్చిన బంతికి బౌల్డ్ చేశాడు. ఇక సర్ఫరాజ్ (14), అశ్విన్ (1)లను హార్ట్లీ అవుట్ చేయడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.
ఆదుకున్న జురెల్-కుల్దీప్: ఓ దశలో 177/7 స్కోరుతో ఉన్న జట్టు 200 పరుగులైనా చేయగలుగుతుందా? అనిపించింది. కానీ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ బౌలర్లను విసిగిస్తూ బ్యాటింగ్ సాగించారు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా వికెట్ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆడారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎనిమిదో వికెట్కు అజేయంగా 42 పరుగులు జోడించగా.. తామెదుర్కొన్న 106 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ మాత్రమే రావడం వీరి డిఫెన్సివ్ ఆటతీరును చూపుతోంది.
ఈసారి ఇంగ్లండ్కు కలిసొచ్చె..
రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంపైర్ కాల్పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తమ స్టార్ ఓపెనర్ జాక్ క్రాలే ఆ విధంగా అవుట్ కావడమే దానికి కారణం. కానీ తాజా టెస్టు రెండో రోజు ఆటలో అదే అంపైర్ కాల్ కారణంగా ఇంగ్లండ్ భారీగా లాభపడింది. ఎందుకంటే క్రీజులో నిలదొక్కుకున్న గిల్తో పాటు రజత్ పటీదార్, అశ్విన్ సైతం అంపైర్ కాల్తోనే పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. వీరి ఎల్బీల విషయంలో భారత్ డీఆర్ఎస్ తీసుకున్నా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడం.. అటు ఇంపాక్ట్లోనూ అంపైర్ కాల్ రావడంతో చేసేదేమీ లేకపోయింది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353
భారత్ మొదటి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; గిల్ (ఎల్బీ) బషీర్ 38; రజత్ (ఎల్బీ) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్లీ 14; జురెల్ (బ్యాటింగ్) 30; అశ్విన్ (ఎల్బీ) హార్ట్లీ 1; కుల్దీప్ (బ్యాటింగ్) 17; ఎక్స్ట్రాలు: 15; మొత్తం: 73 ఓవర్లలో 219/7. వికెట్ల పతనం: 1-4, 2-86, 3-112, 4-130, 5-161, 6-171, 7-177. బౌలింగ్: అండర్సన్ 12-4-36-1; రాబిన్సన్ 9-0-39-0; బషీర్ 32-4-84-4; హార్ట్లీ 19-5-47-2; రూట్ 1-0-1-0.