Share News

జాతీయ పతాకాన్ని అగౌరపరిచాడట!

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:30 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ నెటిజన్లు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఏ మైందంటే.. వరల్డ్‌కప్‌ విజయానంతరం రోహిత్‌ బార్బడోస్‌ గ్రౌండ్‌లో నేలపై జాతీయ పతాకాన్ని నాటిన విషయం తెలిసిందే. ఆ ఫొటోను రోహిత్‌ తన ‘ఎక్స్‌’ ప్రొఫైల్‌ పిక్‌గా

జాతీయ పతాకాన్ని అగౌరపరిచాడట!

రోహిత్‌పై నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ నెటిజన్లు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఏ మైందంటే.. వరల్డ్‌కప్‌ విజయానంతరం రోహిత్‌ బార్బడోస్‌ గ్రౌండ్‌లో నేలపై జాతీయ పతాకాన్ని నాటిన విషయం తెలిసిందే. ఆ ఫొటోను రోహిత్‌ తన ‘ఎక్స్‌’ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నాడు. అయితే జెండా నేలను తాకడమంటే జాతీయ చిహ్నాల గౌరవ చట్టం-1971ను ఉల్లంఘించి నట్టేనని నెటిజన్లు ఆరోపించారు. దీనికి రోహిత్‌ వివరణ ఇస్తూ ‘కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంతో నాది ఉద్వేగభరితమైన అనుబంధం. ఆ పిచ్‌పై మేం విజ యం సాధించాం. మా కలలను నిజం చేసిన ఆ ప్రదేశంపై గౌరవంతోనే అలా చేశా’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - Jul 12 , 2024 | 05:30 AM