Share News

BJP: బీజేఎల్పీ సమావేశం ప్రారంభం.. బీజేపీ ప్రధానకార్యదర్శులే టార్గెట్‌గా..

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:07 AM

అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం నేడు జరగనుంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

BJP: బీజేఎల్పీ సమావేశం ప్రారంభం.. బీజేపీ ప్రధానకార్యదర్శులే టార్గెట్‌గా..

హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం నేడు జరుగుతోంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యదర్శులు కంట్రోల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేఎల్పీ సమావేశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈ సమావేశానికి సమావేశానికి ఎంపీలు డీకే అరుణ, ఈటల, కొండా, నగేష్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై భవిష్యత్తు కార్యాచరణను బీజేఎల్పీ ప్రకటించనుంది. రుణమాఫీలోపాలపై ప్రభుత్వాన్ని రైతుల్లో దోషిగా నిలబెడతామని బీజేపీ అంటోంది.


పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రధానకార్యదర్శులే టార్గెట్‌గా సమావేశం సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలు గెలిపించిన తమపై ప్రధాన కార్యదర్శులు పెత్తనం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కూడా బీజేఎల్పీ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ దినోత్సవంగా జరపాలని బీజేపీ అంటోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం జరుపుతామని సర్కార్ ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని బీజేపీ అంటోంది. గత బీఆర్ఎస్ సర్కార్ జాతీయ సమక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.


మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి దర్శనానికి బండి‌ సంజయ్ వెళ్లనున్నారు. అనంతరం జనరల్ బజార్‌లో బంగారం, వస్త్ర వ్యాపారుల దుకాణాలకు వెళ్ళి సభ్యత్వ నమోదు చేయించనున్నారు. ఉదయం 12.45 గంలకు సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అలాగే 12.30గంలకు ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీలు ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ నేత రామచంద్రరావు తదితరులు పాల్గొననున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:41 AM