Share News

Hyderabad: ప్రధాని రాక సందర్భంగా నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - May 07 , 2024 | 10:11 AM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌(Begumpet Airport) నుంచి రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: ప్రధాని రాక సందర్భంగా నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌(Begumpet Airport) నుంచి రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మంగళవారం రాత్రి 8.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళతారు.

ఇదికూడా చదవండి: మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం!

ఈ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుంచి 9.10 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, మోనప్ప ఐలాండ్‌, రాజ్‌భవన్‌ వరకు వాహనాలను అనుమతించరు. అదే విధంగా మే 8 బుధవారం ఉదయం 8.35 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళతారు. ఈ సందర్భంగా మోనప్ప ఐలాండ్‌, నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వరకు సాధారణ వాహనాలను అనుమతించరని సీపీ తెలిపారు. ఈ సమయంలో ఆయా రూట్లలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

ఇదికూడా చదవండి: Telangana Rains: తెలంగాణకు గుడ్ న్యూస్.. అప్పటి వరకు వర్షాలు

Read Latest News and Telangana News Here

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 10:11 AM