Share News

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు

ABN , Publish Date - May 12 , 2024 | 08:18 AM

Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయ్యింది. ఈరోజు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌ను పరామర్శించేందుకు కేసీఆర్‌ దేవరకొండకు వెళ్లాల్సి ఉంది. రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు
BRS Chief KCR

హైదరాబాద్, మే 12: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) దేవరకొండ పర్యటన రద్దు అయ్యింది. ఈరోజు (ఆదివారం) దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌ నాయక్‌ను (Devarakonda former MLA Ramavath Ravindra Naik) పరామర్శించేందుకు కేసీఆర్‌ దేవరకొండకు వెళ్లాల్సి ఉంది. రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో కనీలాల్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ అధినేత నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేసీఆర్‌ దేవరకొండ పర్యటనకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. దీంతో కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటననుు రద్దు చేసుకున్నారు.

Weekend comment By RK ; మేలుకో ఆంధ్రుడా!


కాగా.. రవీంద్ర కుమార్ తండ్రి కనీలాల్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కనీలాల్ కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీవిరమణ పొందిన కనీలాల్.. స్వగ్రామం రత్యానాయక్ తండాలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు రత్యానాయక్ తండాలో కనీలాల్ నాయక్ అంత్యక్రియలు జరుగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

AP Elections 2024: మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 10:10 AM