Share News

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:18 AM

విద్యా శాఖలో భాగమైన సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్ర్టాకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

షాద్‌నగర్‌, జూలై 3 : విద్యా శాఖలో భాగమైన సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్ర్టాకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. ఈ మేరకు సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తమకు టైం స్కేల్‌ అమలు చేయాలని కోరారు. అలాగే సమగ్ర శిక్ష కేజీబీవీ, యూర్‌ఎ్‌సలను విద్యా శాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లుతామని చెప్పారు.

Updated Date - Jul 04 , 2024 | 07:25 AM