అమరావతి దిశ, దశ మారుతుంది: బాబు

ABN, Publish Date - Jun 28 , 2024 | 07:18 AM

విజయవాడ: రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

విజయవాడ: రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుందని, తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు నాందిపలుకుతుందన్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలన్నారు. అమరావతిలో రామోజీరావు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాత పరువు తీసిన మనవడు..

పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 28 , 2024 | 07:18 AM